చిందేపల్లి గ్రామస్థులతో కలిసి వినుత కోటా నిరాహార దీక్ష

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, చిందేపల్లి గ్రామానికి వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డును ల్యాంకో/ఈసిఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మూసివేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరకి సమస్య తీసుకుని వెళ్ళినా ఎవరు స్పందించలేదు. శాంతి యుతంగా గ్రామస్థులు, మేము నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు గ్రామస్తులను, మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ, గ్రామస్థులపై లాఠీ ఛార్జ్ చేస్తే భయయభ్రాన్తులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మకై ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ వారి నిరసన తెలపాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సోమవారం గ్రామస్థులతో కలిసి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఏర్పేడు మండలం, చిందేపల్లి గ్రామంలోని శివాలయం నందు రాజ్యంగబద్దంగా, శాంతి యుతంగా నిరాహార దీక్ష మొదలు పెట్టాము. మా నిరాహార దీక్ష చిందేపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డుపై కట్టిన అక్రమ గోడను తొలగించే వరకు కొనసాగుతుంది. మాతో పాటు గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.