వాపును చూసి బలుపు అనుకుంటున్న టీడీపీకి ప్రజలే బుద్ది చెబుతారు: రేగిడి

విజయనగరం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టకపోవడంతో టీడీపీ గెలిచిందని టిడిపి నాయకులు గంట శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు కునా రవికుమార్ ఏ విధంగా జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడుతారు..? ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు మాకు సీట్లు ఇవ్వడం ఏంటి? మేమే మీకు సీట్లు ఇస్తాం 20, 30 ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ 2024 అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ ని సీఎంగా చేయాలనే ద్యేయంగా జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళలు పనిచేస్తా ఉన్నారు టిడిపితో మాకు పొత్తు అవసరం లేదు, మీరాడే మైండ్ గేమ్ పవన్ కళ్యాణ్ కి మొత్తం తెలుసు. ఒక్కసారి వారాహితో రోడ్డు మీదకు వస్తే ఎవరి బలము ఏంటో తెలుస్తుంది ఆరు శాతం నుండి 30% కి పెరిగిన జనసేన పార్టీ బలం మాకు ఎవరి దయ దక్షిణాల అవసరం లేదు టిడిపితో పొత్తు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే, టిడిపి అవసరం మాకు లేదు మా అవసరం టిడిపికి మాత్రం ఉంది. అది గ్రహించుకోవాలి. ఇంకోసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి రేగడి లక్ష్మణరావు అన్నారు.