నార్ని తాతాలుకు నివాళులర్పించిన నాగబాబు

నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు నార్ని తాతాలు (నానాజీ) దశదిన కార్యక్రమంలో మెగా బ్రదర్ & జనసేన పార్టీ పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసిన నానాజీ సేవలను గుర్తుచేసుకున్నారు. నానాజీ కుమారులు రామకృష్ణ, శరత్ కుమార్, కుమార్తె యర్రంశెట్టి వెంకటరమణలకు ధైర్యం చెప్పి, పార్టీ వారి కుటుంబానికి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు ఉభయగోదావరి జిల్లాల జనసేన నాయకులు, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య రాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.