నెల్లూరు సిటీలో అనీల్ కుమార్ కి సరైన బుద్ధి చెప్పండి: గునుకుల కిషోర్
నెల్లూరు: 45వ డివిజన్ శ్రీనివాస అగ్రహారం వద్ద ఇల్లు కట్టించిన తర్వాతే ఖాళీ చేయండి అని ఎంఎల్ఏ చెప్పిన మూడు రోజులలోనే ఇల్లు కూల్చడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లు కట్టించిన తర్వాతే మీరు ఖాళీ చేయించండి అని మాట ఇచ్చి ఎంఎల్ఏ మాట తప్పారు. మాట తప్పటం మడమ తిప్పటం వైసీపీకి అలవాటే. సాయంత్రం 6 గంటల పైన ప్రజలను అశక్తులను చేసి వీధిన పడేశారు ఆ సమయంలో పగలగొట్టి చట్టరీత్యా నేరం అని తెలిసినా అధికారులు స్థానికులపై దురుసుగా ప్రవర్తించటం అమానుషం. మాయ మాటలతో ప్రజలను మోసం చేయలేరు. ఎలాగూ అనీల్ నెల్లూరు జిల్లాలో ఉండే అవకాశం లేదని చెప్పకుండానే చెప్పారు. తన నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి చూసుకోకుండా పక్క 3 నియోజక వర్గాల్లో వైసీపీ గెలవకపోతే జిల్లాలో కనపడను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఎవరూ ఓటు వేయనవసరం లేదు. మన వాడే అనుకుని గెలిపించిన ప్రజలను మొన్న కిసాన్ నగర్ ఈరోజు ఇక్కడ అనాలోచితంగా ప్రజలను వీధికి లాగుతున్నారు. సామాన్యులకి అండగా నిలబడ గలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వల్ని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ జనసేన తరపున పోరాడుతామని అనీల్ ఇప్పటికైనా స్పందించి నిరాశ్రయులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో ప్రశాంత్ గౌడ్, షాజహాన్, శరవణ, మౌనీశ్, ప్రసన్న పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-29-at-6.23.22-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-29-at-6.23.23-PM.jpeg)