శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ చల్లని తల్లి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించి, అనంతరం జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా అన్నవితరణ చేసి కమిటీ వారికి 5000/- విరాళాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.