ఇంటింటా ప్రచారంలో పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనం కోసం పవన్ – పవన్ కోసం మనం ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ 3 వ డివిజన్ గీశాల ఫణి, చోడిశెట్టి సతీష్, వనమాడి మహేష్ ఆధ్వర్యంలో జయంద్రనగర్, కళాకారుల కాలనీ, గొడరిగుంటలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మాట్లాడుతూ నేమం, గొడరిగుంట ప్రాంతాల్లో తిరిగితే అక్కడ వైసీపీ నాయకులు సమావేశాలు పెడుతున్నారు. నేమంలో పట్టాల పంపిణీ, గొడరిగుంట డ్వాక్రా మహిళలతో సమావేశం. మాకు సమస్యల పరిష్కారము, ప్రజాశ్రేయస్సు ముఖ్యం. పెన్షన్ల సంఖ్య తగ్గించి, పైకం పెంచావు, దోమలబెడద వల్ల మందులకు లక్షల ఖర్చు పెరుగుతోంది, పథకాల పేరుతో నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోయావు. ఇలాంటి పనులు చేయడం వలెనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానికులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.