మృతిని కుటుంబానికి నష్టపరిహారంగా 50 లక్షలు చెల్లించాలి: శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం, బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన ఉమ్మిడి వెంకటేష్ అనే వ్యక్తి యూగియ స్టెరైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తూ డ్యూటీలో ఉండగా అనుమానాస్పదంగా మృతి చెందగా దానిని సాధారణ మరణంగా చిత్రీకరించే పనిలో ఉన్న కంపెనీ యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. మృతిని కుటుంబానికి నష్టపరిహారంగా 50 లక్షలు మరియు కంపెనీలో కుటుంబసభ్యులకు ఉద్యోగం తక్షణమే ఇవ్వవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది, లేనిపక్షంలో కంపెనీ వద్దే ఉద్యమానికి సిద్దమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హెచ్చరించారు.