ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన పార్టీ అమలాపురం ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో జానీ బాషా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపద్యంలో ప్రజల దహార్తిని దృష్టిలో పెట్టుకుని ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించినట్లు జానీ బాషా తెలిపారు. మజ్జిగ చలివేంద్రం 2 నెలలు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.