ఖమ్మం జనసేన ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

ఖమ్మం నగరం, ఎన్టీఆర్ సర్కిల్ లో గల స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుడుగా, కేంద్ర మంత్రిగా మరియు భారత ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. నిమ్న, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేసిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి రాజకీయ నాయకత్వం ఇప్పుడు ఈ దేశానికి ఎంతో అవసరం. అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళతాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నాయకులు మెడబోయిన కార్తీక్, యాసంనేని అజయ్ కృష్ణ, భోగా హరిప్రియ, కొండా పవన్, ప్రభాకర్, ఎస్కె.మాలిక్, బానోత్ దేవేందర్, విజయ, ఉత్తమ్ కుమార్, స్రవంత్, రమణ కుమార్, ఉదయ్, నరేష్, రంజిత్, అనిల్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.