కుక్కునూరు, కివ్వాక గ్రామంలో జనంలో జనసేన

పోలవరం, కుక్కునూరు మండల అధ్యక్షులు యుగేందర్ ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది. కుక్కునూరు, కివ్వాక గ్రామంలో జనసేన పోలవరం పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రతి ఇంటికి వెళ్లి అందర్నీ ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్నా సమస్యలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలి అన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా అది కేవలం మన పవన్ కళ్యాణ్ కి సాధ్యమన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారుల నిర్లక్ష్యం గ్రామాలు రాష్టం మరింత వెనుక పడిపోయిందన్నారు. నిర్వాసితులను పట్టించుకోని అధికార ఎమ్మెల్యే మీద మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు యుగేందర్, నాయకులు, గ్రామపెద్దలు, జనసైనికులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.