తాడేపల్లిగూడెం జనసేన ఆధ్వర్యంలో డా.బాబు జగజీవన్ రామ్ కు ఘననివాళి

తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన డా.బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, భారతదేశ ఉప ప్రధానిగా, దళితులకు ఆయన చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణ మూర్తి, చాపల రమేష్, గుండెమోగుల సురేష్, అడపా ప్రసాద్, అడ్డగర్ర సురేష్, కేశవబట్ల విజయ్, పుల్లా బాబి, అడబాల మురళి, ముఖేష్, గట్టిం నాని, వీరమహిళలు వెజ్జు రత్న కుమారి, పెనుబోతుల సోమలమ్మ, చాంద్ బీబీ, విజయ తదితరులు పాల్గొన్నారు.