పవనన్న ప్రజా బాట 14వ రోజు
విశాఖ, పవనన్న ప్రజా బాట 14వ రోజు దక్షిణంలో విజయవంతంగా సాగింది. దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దక్షిణ నియోజకవర్గంలో సుమారుగా అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మంగళవారం నాటితో ఈ కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. 31, 32, 33 వాటిలోని పలు ప్రాంతాలలో డాక్టర్ కందుల నాగరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. జనసేన పార్టీకి తమ పూర్తి మద్దతును తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే జనసేన అభిమతమని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత పురోభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలందరూ ఆయన కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మంచిని డాక్టర్ కందుల ఈ సందర్భంగా అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-11.52.17-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-11.52.17-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-11.52.18-1024x768.jpeg)