దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట

విశాఖ, ప్రజాసేవ ధ్యేయంగా తాను చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తుందని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. సోమవారం దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోనే తాను రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో తాను చేపడుతున్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. తాను చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి కూడా దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వెళ్లిన పరిస్థితి చోట హారతులతో స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. జనసేన పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జనసేన పూర్తిస్థాయిలో బలోపేతం అయిందన్నారు. ఈ సందర్భంగా తనతో కలిసి పాల్గొని ఈ కార్యక్రమ విజయవంతనికి కృషి చేస్తున్న జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, గ్రంధి దేవి, మంగ, లలిత, హేమ కుమారి, బద్రీనాథ్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 33వ వార్డు, వెంకటేశ్వర్లు మెట్ట ప్రాంతంలో పుష్పవతి అయిన సిరపు జానూకు పసుపు కుంకుమ, కొత్త బట్టలను అందజేసారు. ఏరియా వెంకటేశ్వర మెట్ట, 33వ వార్డు, పవనన్న ప్రజా బాటలో దక్షిణ నియోజకవర్గం పర్యటించారు.