రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
- రాజంపేట జనసేన నాయకులు
రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా రాజంపేట నియోజకవర్గ పరిదిలోని పలు గ్రామాలైన పాపరాజుపల్లి, బాల్ రెడ్డి గారి పల్లి, కోపు లలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రాజంపేట జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, చంగల్ రాయుడు, జనసేన వీరమహిళలు, జెడ్డా శిరీష, మాధవి, జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-4.53.05-PM.jpeg)