తెలికిపెంట పంచాయతీలో జనంకోసం జనసేన
ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలికిపెంట పంచాయతి పర్వతాలు పేట, అగ్రహారం, గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలతో కరపత్రం రూపంలో జనంకోసం జనసేన కార్యక్రమంతో వివరించి గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆయనతో పాటుగా నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్ మండల నాయకులు ముడాడ్ల నాగరాజు, టంకాల తిరుపతి, రాకోటి రమేష్, కొంగరాపు మౌళి, మురాల మిన్నారావు, మోహన్, దుర్గాప్రసాద్, శ్రీధర్, రమేష్,కోటి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-17.48.38-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-17.48.39-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-17.48.39-1024x768.jpeg)