ముక్కినాడ గ్రామంలో బత్తుల పర్యటన – పలువురి బాధితులకు అండ

రాజానగరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను జనసేన పార్టీని విధివిధానాలను క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు వివరిస్తూ చేరువ చేస్తూ అదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు సమాంతరంగా కష్టాల్లో, బాధల్లో ఉన్న బాధిత కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులురాలు మరియు జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ముక్కినాడ గ్రామంలో పర్యటించి, పలువురి బాధిత కుటుంబాలను ఓదార్చి భరోసాను కల్పించారు.

  • ముక్కినాడ గ్రామవాసి సోడసాని గంగారావు పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం తెలియడంతో వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.
  • ఎస్సి సామాజికవర్గానికి చెందిన మోర్త సత్యనారాయణ షుగర్ వ్యాధితో రెండు కాళ్ళను కోల్పోగా వారిని పరామర్శించి, మనోధైర్యం కల్పించి, రాబోవు రోజుల్లో జనసేన పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిస్తూ కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.
  • బిసి నేత గుత్తుల బాపనయ్య గాగత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారన్న విషయం తెలియడంతో వారిని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.
  • బిసి వర్గానికి చెందిన మల్లెమొగ్గల పార్వతి వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెను పరామర్శించి, ధైర్యంగా ఉండమని భరోసానిస్తూ ఆమె పోషణ నిమిత్తం ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వెంట కవల శ్రీరామ్, కవల హరిచంద్రప్రసాద్, సోడసాని సురేష్, సోడసాని చక్రధర్, ఏ.శ్రీను, సోడసాని రాంమూర్తి, మండేలి చిన్నపాప, సోడసాని వెంకటేష్, కొండేపూడి రాజు, మరియు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరాం, కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, సంగుల రమేష్, మేకల ప్రదీప్, కమిడి సత్యనారాయణ, సుంకర బాబ్జి, పంతం సూరిబాబు, నల్లమిల్లి మణికంఠ, నాతిపాం సుబ్బారావు, నాతిపాం రాజు బాబు, పంతం మణికంఠ, నాతిపాం మణి తేజ, కలిదిండి మణికంఠ, మండల సాంబమూర్తి, కుసుమ శ్రీను, సైను రాజశేఖర్, బక్కే అశోక్, బక్కే విశాక్, పాకా వెంకీ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.