నూతన కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి పాలవలస యశస్వి

విజయనగరం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి బుధవారం విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్ గా వచ్చిన శ్రీమతి నాగలక్ష్మి సెల్వరాజ్ ని జనసేన పార్టీ తరుపున మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరుపున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామచంద్ర రాజు, ఆదాడ మోహనరావు, బొబ్బది చంద్రునాయుడు, దాసరి యోగేష్ తదితరులు పాల్గొన్నారు.