కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

కాకినాడ సిటీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా కాకినాడ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు స్థానిక రేచర్లపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రేచర్ల పేట యువత కోడి శ్రీను, పచ్చిపాల మధు, కంట రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్య నారాయణ, కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, 43వ డివిజన్ ఇంచార్జ్ శ్రీమన్నారాయణ, దాసరి వీరబాబు, బసవ నాగబాబు, జాక్, మహమ్మద్ సమీర్, నరం మున్నా, నరం కొండ, టీవీ సత్యనారాయణ, బుల్లెట్ శ్రీను, ఎస్సై వీరబాబు, బండి అజయ్, మోస ఏసేపు, నకిలే సత్తిబాబు, దారపు సతీష్, కోటేశ్వరరావు, జార్జ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.