ఎమ్మిగనూరు జనసేన కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 132 వ జయంతి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన నాయకుడు కాదని ఆయన అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన నాయకుడని ఆయన జీవన విధానాలు ఆయన ఆలోచనలు నేటి యువతకి ఎంతో ఆదర్శమని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతుకుతున్నారనికొనియాడారు. నేటి సమాజంలో ప్రతిఒక్కరూ అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రవి ప్రకాష్, రాహుల్ సాగర్, కర్ణం రవి, బజారి, షబ్బీర్, వెంకటేష్, రషీద్, మల్లికార్జున, మంజు, సూరి, మహేంద్ర, చిన్నా, తదితరులు పాల్గొన్నారు.