భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ కు సూర్యాపేట ఘననివాళి
సూర్యాపేట, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పిస్తూ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తూ ఆ మహానీయునికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జనసేన పార్టీ నాయకులు చింతల నాగార్జున, రామగిరి శివ సాయి, గుడిసె గౌతమ్ రాజ్, చంద్రబోయిన ప్రసన్న మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-12.05.45-768x1024.jpeg)