అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సింగరాయకొండ జనసేన

కొండెపి, భారత రాజ్యాంగం రూపకర్త, డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా శుక్రవారం సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ అధ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ కులవర్గ నాయకుడు కాదు, భారతజాతి మార్గదర్శకుడు, ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి, ఇటువంటి గొప్ప విద్య వేత్త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి జోహార్. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడాశశి భూషణ్, సింగరాయకొండ మండల నాయకులు ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ బాషా, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, మండల కార్యదర్శిలు ఉప్పుటూరి రజిని, అనుముల శెట్టి కిరణ్ బాబు గుంటుపల్లి శ్రీనివాస్ పోలిశెట్టి విజయ్ కుమార్ వాయిల అనిల్, పలుపు లేటి శ్రీకాంత్, శ్రీను, ప్రచార కార్యదర్శి తగరం రాజు, వీర మహిళలు పోలిశెట్టి మాధురి, మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.