స్పందన లేకపోతే జనసేన తరఫున నిరసనకు సిద్ధం

హైదరాబాద్, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు మరియు తుమ్మలపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ శుక్రవారం ఉదయం హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయం నందు జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. మరియు జనసేన పార్టీ నాయకులు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని విటిపిఎస్ స్టేజ్-1 నుంచి వెలువడే కాలుష్య వాయువులు గురించి చర్చించడం జరిగింది. వీటిపిఎస్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే జనసేన తరఫున నిరసన తెలియడానికి సిద్ధంగా ఉన్నామని ప్రస్తావించడం జరిగింది.