అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ దొర్లమ్మ తల్లి జాతర మహోత్సవం

రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత శ్రీశ్రీశ్రీ దొర్లమ్మ తల్లి జాతర మహోత్సవం భారీ జన సమూహంతో కనుల పండుగలా జరిగింది. ఈ వేడుకకు కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు జాతర మహోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ భారీగా చేరుకున్న జనశ్రేణులతో సంయుక్తంగా అమ్మవారిని దర్శించి ఆ తల్లి దయ, కృప, కరుణాకటాక్షాలు తోకాడ గ్రామ ప్రజలతోపాటు ప్రజలందరిపై ఉండి, ఈ ప్రాంతం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, రైతుల,కూలీల జీవితాల్లో వెలుగులు నిండి అందరి జీవితాలు సుఖమయం కావాలని ఆకాంక్షించారు. బత్తులు బలరామకృష్ణ ఈ వేడుకకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో వందలాది జనసైనికులు వారి వద్దకు చేరుకుని కరచాలనం చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. అధిక సంఖ్యలో జనశ్రేణులు చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా అందర్నీ ఎంతో ఓపిగ్గా ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేసుకుంటూ ఉత్సాహంగా జరిగిన ఈ జాతర మహోత్సవంలో జనసేన నాయకులు, జనసైనికులు, తోకాడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.