సనత్ నగర్ జనసేనలో భారీ చేరికలు
తెలంగాణ జనసేన పార్టీ సనత్ నగర్ నియోజకవర్గంలో వీరమహిళలు, యువత భారీ సంఖ్యలో శుక్రవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని జనసేన వైపు అడుగులు వేసేందుకు గ్రేటర్ హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గం మరియు అమీర్పేట్ డివిజన్ నుండి జనసేన పార్టీలోకి మండపాక కావ్య సనత్ నగర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగపురం పద్మ, వీరమహిళలు మరియు యువత. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే సావిత్రిక ఎన్నికల్లో పాల్గొనడానికి జనసేన బలం పెంచుకుందుకు ప్రతి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి పార్టీ కోసం పని చేయడానికి ఉత్సాహంగా ఉన్న వీరమహిళను, యువతను పార్టీలోకి ఆహ్వానించాలిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాజేష్, రాంలింగం, డా.మాధవ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-22.26.37-1024x465.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-22.26.38-1024x504.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-22.26.38-1-1024x692.jpeg)