కృష్ణా జిల్లాలో జనసేనాని పర్యటన.. కలెక్టర్లకు వినతి పత్రాలు

నివర్ తుపాను, ఇతర ప్రకృతి విపత్తుల మూలంగా నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్  రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని జనసేనాని  పవన్  ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో నేడు పర్యటన కొనసాగుతోంది. నివర్‌ తుపానుతో నష్టపోయిన పంటలను పవన్‌ పరిశీలిస్తున్నారు. కంకిపాడు నుంచి ర్యాలీగా గుడివాడ మీదుగా ఆయన మచిలీపట్నం చేరుకోనున్నారు. మార్గం మధ్యలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్‌ రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తుపాను సాయం మరింత పెంచాలని డిమాండ్‌ చేసిన జనసేనాని ఈమేరకు కలెక్టర్‌కు వినతిప్రతం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్‌రోడ్‌ వద్ద పవన్‌కు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.  పంట నష్టం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతులు జనసేనానని కోరారు. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్‌ వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు.