హెల్త్ బులిటెన్
తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 44,572 మంది కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో మృతి చెందగా,మొత్తం మృతుల సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15, 640 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారిగా రంగారెడ్డి 289, వరంగల్ అర్బన్ 102, మేడ్చల్ 151, కరీంనగర్ 97, నల్గొండ 61 మహబూబ్నగర్ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.