రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్, కొండాపూర్ నుండి ముల్కనూర్ వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కొండాపూర్ వద్ద రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు గుంతలు పడి కొన్ని నెలలు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పట్టించుకోవడంలేదు. హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే ప్రధాన రహదారి కావున నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడంతో ప్రయాణికులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు తప్పించబోయి కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేనిచో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, పొడిశెట్టి విజయ్, గుండా సాయి చంద్, మొలుగూరి అరవింద్, కొలుగూరి అనిల్, కత్తరమల్ల శ్రీకాంత్, బోయిని ప్రసాద్, బత్తుల సాయితేజ తదితరులు పాల్గొన్నారు.