ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన అవనిగడ్డ జనసైనికులు

అవనిగడ్డ, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అవనిగడ్డ 7వ వార్డులో గల జామియా మసీదులో ప్రార్థన చేసే ముస్లిం సోదరులకు అవనిగడ్డ మండల జనసేన పార్టీ తరపున శనివారం సాయంత్రం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ కఠిన దీక్షతో కూడిన ఉపవాస దీక్ష చేయడం ఎంతో కష్టం అయినప్పటికీ నిష్టతో చేస్తున్న ముస్లిం సోదరులను ఎంత అభినందించినా తక్కువే అవుతుంది అని చెప్పారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు షాదీఖానాలో శేషుబాబును శాలువాతో సత్కరించారు. జనసేన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ కాటమ మరియు వారి మిత్రులు విందు ఏర్పాట్లను పర్యవేక్షించగా 200 మంది విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహమాన్, లైలా, మురాద్, కలీల్, ఖాదర్, ఖిజార్, బషీర్, ఇమ్రాన్, కరీముల్లా, ఎంపీటీసీ బొప్పన భాను, బాసు నాంచారయ్య నాయుడు, తోట ఆంజనేయులు, అవినాష్, బాలు, కమతం నరేష్, లక్ష్మణ, పప్పుశెట్టి శ్రీను, బొప్పన పృథ్వి, రోహిత్, సాయి భార్గవ తదితరులు పాల్గొన్నారు.