కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామనడంలో కుట్ర ఉంది: బండి సంజయ్‌

కొనుగోలు కేంద్రాల వల్ల నష్టం వస్తుందని, అందుకే వాటిని ఎత్తివేస్తామనడంలో కుట్ర ఉందని..  రైతులను గందర గోళంలో పడేయాడానికే కొనుగోలు కేంద్రాల ఎత్తివేత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల సీఎం అని రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. రైతు చట్టాలు అర్థం చేసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని,  రైతు వేదికలను కేంద్రం నిధులతోనే నిర్మించారని చెప్పారు. పంట కొనుగోళ్లలో కూడా కేంద్రం వాటా ఉందని బండి సంజయ్‌ తెలిపారు.