ప్రదీప్ వర్మ డైరెక్షన్లో మరో సినిమాకు శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్
వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ‘రాజ రాజ చోర’, ‘గాలి సంపత్’ చిత్రాలు చేస్తున్న శ్రీవిష్ణు, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లోనూ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాల తో పాటూ వివిధ దశల్లో ఉండగానే తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఓ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్కు శ్రీవిష్ణు అంగీకారం తెలిపారు. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రి-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, శివేంద్ర సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. మిగతా టెక్నీషియన్ల పేర్లను త్వరలో వెల్లడించనున్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.