దల్లి గోవిందరెడ్డి ఆద్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్‌..

గాజువాక నియోజవర్గం 64వ వార్డు గంగవరం గ్రామం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ దల్లిగోవింద రెడ్డి స్పందించి, జీవీఎంసీ అధికారులతో మాట్లాడి గంగవరం గ్రామంలో దోమలు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారానికి ఒక్కరోజైనా పలుచోట్ల దోమల ఫొగింగ్ కార్యక్రమం చేపట్టాలని గౌరవ కార్పొరేటర్ గోవింద్ రెడ్డి జివిఎంసి కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పై కమిషనర్ స్పందిస్తూ ఫాగింగ్‌ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఆయన తెలియజేశారు, మరియు స్థానిక మహిళలు గోవింద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగానూకరాజు, ఆది. పి నూకరాజు, కోదండరావ్, శివాజీ, నూకరాజు, దేవుడు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి చోడి పిల్లి ముసలయ్య పాల్గొన్నారు.