జనసేన ప్రజా చైతన్య యాత్ర 7వ రోజు

బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” అనే కార్యక్రమాన్ని 7వ రోజు బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు గ్రామంలో, ఇంటింటా ప్రచారం చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో గోపాలరాయుడుపేట గ్రామ జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.