కేజీఎఫ్ కోవూరు గ్రావెల్ ఫ్యాక్షన్ అరికట్టాలి: జనసేన డిమాండ్

నెల్లూరు: కేజీఎఫ్ కోవూరు గ్రావెల్ ఫ్యాక్షన్ అరికట్టాల్సిందిగా జనసేన తరపున ఎమ్మార్వో, కమిషనర్ లకు వినతిపత్రాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు సుదీర్ బద్దెపూడి మరియు జనసైనికులు అందజేయడం జరిగింది. అనుమతులు లేకుండా పరిమితులు మించి అక్రమంగా కోట్ల రూపాయల గ్రావెల్ నియోజకవర్గం తరలిపోతుందని పంచాయతీలు, నగరం పరిధిలో తిరుగుతున్న హెవీ వెహికల్స్ వలన రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే అక్రమ మైనింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన తరపున కోరారు.