పేద ముస్లింలకు జనసేన కువైట్ టీమ్ రంజాన్ తోఫా

  • ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన
  • నాగేంద్ర, ముకరం చాంద్

ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ప్రార్థనలు చేస్తూ నెల రోజులపాటు కొనసాగే ఉపవాసాల ప్రక్రియకు ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పేద ముస్లింల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్ లు తెలిపారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కువైట్ టీం, షేక్ఆలీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పేద ముస్లింల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న ప్రజలకు బాసటగా నిలిచి కరోనా సమయంలో జనసైనికులు అందించిన సేవలు ఆమోగమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసైనికులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తారని గుర్తు చేశారు. అదేవిధంగా చిట్వేలి లోని పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి రంజాన్ తోఫా అందించడం జరిగిందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రవర్త మహమ్మద్ రసూల్, ఆయన మార్గంలో నడుస్తూ ప్రతి ముస్లిం సోదరుడు, సోదరి ప్రార్థనలు చేయడం ఉపవాసాలు ఉండడం భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు తెలియజేశారు. మతాలను గౌరవించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అటువంటి నాయకుడు అడుగుజాడల్లో ముందుకు పోతూ సేవలందించేందుకు జనసైనికులు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులుమాదాసు నరసింహ, కంచర్ల సుధీర్ కుమార్ రెడ్డి, మాదాసు శివ, తుపాకుల పెంచలయ్య, షేక్ రియాజ్, జనసేన నాయకులు కువైట్, సుభాష్ చంద్రబోస్, ఆనందలతేజ, హేమంత్ రెడ్డి, సువారపు భాను, షేక్ అబ్దుల్లా, షేక్ మస్తాన్, షేక్ సద్దాం, ముస్లిం సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.