రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

  • పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి..!!

పిఠాపురం రూరల్, జల్లూరు గ్రామం: రాష్ట్ర అభివృద్ధికై జనసేనకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఇంటి ఇంటి కి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి మంగళవారం జల్లూరు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీలు లేక మురుగు నీరు పోవడానికి దారిలేక ఇబ్బంది, ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని స్థలాలు చూపించ లేదని స్థానికులు శేషుకుమారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శేషు కుమారి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అని రాష్ట్రాన్ని దోచేసి, ప్రజలను అప్పులపాలు చేసిన జగన్ రెడ్డి. జగనే మా భవిషత్ అని స్టిక్కర్లు అంటించే వైసీపీ పార్టీ కార్యక్రమాలకి వాలంటీర్లను, సచివాలయం సిబ్బందిని వినియోగించు కుంటున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక పార్టీ కార్యక్రమమా? అర్థంకావడం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, జనసేన నాయకులు గోపు సురేష్, పిఠాపురం టౌన్ అధ్యక్షులు బుర్రా సూర్య ప్రకాష్ రావు, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, చదరాడ చిరంజీవి, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యకరరావు, బుర్రా విజయ్, కఒదా సోమరాజు, కాళ్ళ రాజు, దాసం కొండబాబు, బోదిరెడ్డి భీమరాజు, నామా శ్రీకాంత్, మొగలి శ్రీను, గొల్లపల్లి గంగా, కసిరెడ్డి నాగేశ్వరావు, మైనబత్తుల చిన్నా, పేదిరెడ్ల భీమేశ్వరరావు, కారపురెడ్డి మణికంఠ, మొగలి శ్రీను, సకినాల రాంబాబు, జ్యోతుల శివశంకర్, మెడిబోయిన నాగేశ్వరరావు, అల్లం దొరబాబు, ఆకుల శ్రీను, దమ్ము చిన్నా, గంటా గంగబాబు, మెడిబోయిన హరి ఆడలి వినోద్ కుమార్, ఎస్.కే షారుఖ్, యర్రంశెట్టి దుర్గా, కడలి వినోద్ కుమార్, యర్రంశెట్టి చందు, బొచ్చు నాని, తదితరులు పాల్గొన్నారు.