విద్యార్థులు, నిరుద్యోగులకు ఐటీ కోర్సులను ఉచితంగా ప్రారంభిస్తున్న జనసేన ఐటీ: పైల

పార్వతీపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు పిఏసి ఛైర్మన్ మనోహర్ సూచనల మేరకు జనసేన ఐటీ విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు/విద్యార్థులకు వివిధ ఐటీ కోర్సులను అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగస్తులుచే ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కార్మికుల దినోత్సవం సందర్భంగా ఒరాకిల్, ఎస్.క్యు.ఎల్ కోర్సును ప్రారంభిస్తున్నాము. కావున ఈ కోర్సులో శిక్షణ పొందాలి అన్న ఔత్సాహికులు తమను సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణ ప్రకటనలో తెలియచేశారు.