కొండపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు

మైలవరం, కొండపల్లిలో ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ మోహనరావు(గాంధి) పాల్గొనడం జరిగింది. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కల గాంధి మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులు పవిత్ర రంజాన్‌ మాసాన్ని ఎంతో నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారని పేర్కొన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, సోదరభావానికి చిహ్నమైన రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.