జనసేన ప్రజా చైతన్య యాత్ర

బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం “అనే కార్యక్రమాన్ని 11వ రోజు బాడంగి మండలం కోటిపల్లి, బోత్సవానివలస గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి, బోత్సవానివలస గ్రామ జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.