కేజిహెచ్ వద్ద డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి

విశాఖ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కేజీహెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.పి.రాజు (మిస్టర్ లైట్), నీలం రాజు, పసుపులేటి మోహన్, నందకిషోర్, కె.వి.ఎస్.ఎన్.రాజు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ(జికె) చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.