శేరిలింగంపల్లి జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కో ఆర్డినేటర్ డాక్టర్.మాధవరెడ్డి ఆధ్యర్యంలో శనివారం జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పార్టీ పోటీచేయనున్న నేపద్యంలో ఈ సమవేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యకర్తల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి ఒక కార్యకర్త బలంగా ప్రజలోకి తీసుకుని వెళ్ళాలి అని అన్నారు. సమస్యలపై కూడా దృష్టి సారించి పోరాటం చేసేలా సిద్ధ పడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షాయని, పుష్ప, అరుణ్, శ్రవణ్, సందీప్, లక్ష్మీనారాయణ, మాధవరావు, ప్రవీణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-22-at-21.36.54-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-22-at-21.36.58-1024x461.jpeg)