ఘనంగా జనంకోసం జనసేన మహాపాదయాత్ర
- జనసంద్రంగా మారిన మిర్తిపాడు గ్రామం.
- జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి అడుగడుగునా నీరాజనాలు పలికిన మిర్తిపాడు గ్రామ ప్రజలు.
రాజానగరం, సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో “జనంకోసం జనసేన మహాపాదయాత్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆశయాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బాగోగులు అడిగి తెలుసుకొంటూ జనసేన పార్టీ కరపత్రం ఇచ్చి ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వమని అభ్యర్దిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో మిర్తిపాడు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-24-at-14.24.36-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-24-at-14.24.33-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-24-at-14.24.33-1-1024x682.jpeg)