జనసేన జనబాటకు ప్రజల నుండి అనూహ్య స్పందన

పెద్దాపురం, జనసేన జనబాట కార్యక్రమానికి ప్రజలను విశేష స్పందన వస్తుందని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వీరరాఘవపురం నందు జనసేన జనబాట కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నియోజవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం రూపొందించడం ప్రజా మద్దతును కూడగట్టడమే జనసేన పార్టీ జనబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరరాఘవపురంలో జనసేన యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని బాబు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పిట్టా జానకి రామారావు సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజ వాసు, తుమ్మల ప్రసాద్ మంచెం సాయిబాబు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.