శ్రీ డొక్కా సీతమ్మ చలివేంద్రంను ప్రారంభించిన మర్రెడ్డి శ్రీనివాసరావు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో మండల మరియు గ్రామ జనసేన కమిటీ ఆధ్వర్యంలో శ్రీ డొక్కా సీతమ్మ చలివేంద్రంను నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బిక్కవోలు జనసైనికులు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ ఉపాధ్యక్షులు కామాకుఅరుణ్ కుమార్ ఐసులు మండల ప్రధాన కార్యదర్శి కర్రి శ్రీను గారు పుచ్చకాయ జ్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా దాతల సహకారంతో చల్లని మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావాడ నాగు, బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, బిక్కవోలు గ్రామ శాఖ అధ్యక్షులు తోట సతీష్(పండు), బిక్కవోలు అనపర్తి మండలాల యువజన విభాగం అధ్యక్షులు కొండబాబు, చైతన్య రెడ్డి, బిక్కవోలు జనసేన నాయకులు వడ్లమూరి గోవిందరాజు, అనపర్తి మండలం ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు చంద్రరావు, ప్రసాద్, బిట్టు, సతీష్, జనసేన నాయకులు నాగిరెడ్డి, రాంకీ రెడ్డి, సుంకర బుజ్జి, మద్దూరి వీరబాబు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.