శ్రీశ్రీశ్రీ గొంతెలమ్మ తల్లి, శ్రీశ్రీశ్రీ సోమలమ్మ తల్లి జాతరలో పాల్గొన్న అనుశ్రీ

రాజమండ్రి సిటి, స్థానిక జాంపేట వద్ద శ్రీశ్రీశ్రీ గొంతెలమ్మ తల్లి, శ్రీశ్రీశ్రీ సోమలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి 32వ వార్డ్ జనసైనికులైన పండు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనుశ్రీ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్ సంయుక్త కార్యదర్శి దేవకేవాడి చక్రపాణి మరియు జనసేన నాయకులు మంచాల సునీల్ శంకర్ పాల్గొనడం జరిగింది.