చందానగర్ మున్సిపల్ అధికారులకి జనసేన వినతిపత్రం

శేరిలింగంపల్లి, గత సంవత్సర కాలంగా రోడ్లు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోకుండా ఉండడం మరియు మరమ్మతులు చేయకుండా ఉండడం వలన వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని, మరియు అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను ఎదైనా గానీ ఈ వేసవి కాలంలో పెండింగ్ పనులను పూర్తి చేసి వెంటనే పరిష్కరించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ మాధవరెడ్డి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తూ జి.హెచ్.ఎం.సి అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వ పనితీరు బాగలేని ప్రతిచోట ఇకనుండి నిస్వార్థంగా జనసేన పార్టీ ప్రశ్నిస్తుందని జనసేన శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ డా.మాధవ రెడ్డి జనసైనికులతో కలిసి ఈ సమస్యను ప్రభుత్వ అధికారులకు తెలియచేస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు పన్నులు కడుతున్నప్పుడు అడిగే హక్కు కూడా ఉంటుందని మర్చిపోయారు. ప్రశ్నించడం మన బాధ్యత అని చెప్పారు. ఇందుకోసం ప్రజాబలం తోడైతే మన సమస్యలు త్వరితగతిన పూర్తి అవుతాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ దాక్షాయని మరియు జనసైనికులు అశోక్, సందీప్ కసెట్టి, శ్రవణ్ కుమార్ జి.ఎస్.కే, సాయి సతీష్, నర్సింహ, ఉపేంద్ర, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.