రాజంపేటలో 88వ రోజుకు చేరుకున్న పవనన్న ప్రజాబాట

  • రాజంపేట జనసేన నాయకులు భాస్కర పంతులు

రాజంపేట నియోజకవర్గంలోని రోళ్ళమ్మడుగు, బాలరాజు పల్లి, బుడుగుంట పల్లిలలో రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజాబాట 88వ రోజు కార్యక్రమాన్ని రాజంపేట జనసేన నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు భాస్కర పంతులు మాట్లాడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే మారుతుందని ఆ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, గోపి, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.