పిండి కుటుంబానికి నాదెండ్ల పరామర్శ

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జనసేన పట్టణ మాజీ అధ్యక్షులు పిండి సాయిబాబు కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులను పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. కుమారుడు పిండి రాజాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనోహర్ వెంట జనసేన నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, డిఎంఆర్ శేఖర్ తదితరులు ఉన్నారు.