సర్వేపల్లిలో 11వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామం నందు 11వ రోజు శనివారం జనంకోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ చవటపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి 30 కుటుంబాలకి తాగునీరు అందక ఎంతో ఇబ్బంది మండల స్థాయి అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లడం వాళ్లకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ గ్రామస్తుల సమస్య మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి అక్కడికి వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకొని వెంటనే స్థానిక సచివాలయ సిబ్బంది కి పంచాయతీ సెక్రెటరీ తెలియజేశాం. ఏఈతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మండల ఎంపీడీవో దృష్టికి కూడా తీసుకువెళ్లామని, ఈ సమస్యని వారం రోజుల లోపల పూర్తిస్థాయిలో పరిష్కారం చేయకపోతే జనసేన సొంత నిధులతో వాళ్లకి కొత్త పైపులైను వేయించి వాళ్లకు తాగునీరు అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వం యంత్రాంగం కావచ్చు గత 4 సంవత్సరాల నుంచి తాగునీరు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటే పాలకులు ఏం చేస్తున్నారు అంటే ప్రజల సమస్యలు మీకు పట్టవా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం చవటపాలెం గ్రామం 13 వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సొంత గ్రామం మరి ఆ గ్రామంలో 30 కుటుంబాలకి తాగునీరు లేక గత 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ఎందుకని ఈ అధికార పార్టీకి సంబంధించిన వారు వాళ్ళ సమస్యను పరిష్కరించలేదు మంత్రి గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తే మరి ప్రజా సమస్యలు అంటే ఎందుకు నిర్లక్ష్య త్వరితగతిన వాళ్ళకి తాగునీరు సమస్యకి పరిష్కారం జరగాలి అలా జరిగనీ పక్షంలో జనసేన పార్టీ బలంగా నిలబడి సమస్య పరిష్కరించే అంతవరకు పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ఖాజా, నవీన్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.