కొవ్వాడలో అభివృద్ధి ఎక్కడుంది?: రెడ్డిపల్లి రాజేష్

కాకినాడ రూరల్, కొవ్వాడలో అభివృద్ధి ఎక్కడుంది దళితుల స్మశానంలో ట్యాంకు నిర్మాణాన్ని కూడా నేటికీ నిర్మించని ఈ ప్రభుత్వం 6 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసామంటూ గొప్పలు చెప్పుకుంటుందని కాకినాడ రూరల్ మండల జనసేన ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 మంది జనసేన నుంచి వైకాపాలోకి వెళ్లారని చెపుతున్న ఎంపీపీ భర్త అసలు వాళ్లు మా జనసైనికులే కాదని గతంలో వైకాపాలో ఉన్న వారేనని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీ జనసేన అధ్యక్షులు గుమ్మడి వీరబాబు, జనసైనికుడు చింతలపూడి సుబ్బారావులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని వచ్చేది జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అవుతారని జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.