శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లిని దర్శించుకున్న బత్తుల

రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు బలరామకృష్ణకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ప్రసిద్ధి చెందిందని తెలియజేసారు. తల్లి దీవెనలతో ప్రజలందరూ వారి వారి కుటుంబసభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని కోరుకున్నారని తెలిపారు. ఈ జాతరలో వీరితో పాటు కిమిడి శ్రీరామ్, నాతిపాం దొరబాబు, మదిరెడ్డి బాబులు, తోకాడ రాజు, నరాల వెంకటరమణ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, పుణ్యక్షేత్రం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.